Monday, April 29, 2024

చంద్రగిరి మండలంలో కారు బోల్తా- ఒకరు మృతి

చంద్రగిరి మండలం ముంగిలిపట్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన బారికేడ్లను కారు అతివేగంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో వాహనం పట్టీలు కొట్టింది. ఈ ఘటనలో తిరుపతి చెందిన వ్యక్తి మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు 108 సహాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement