Sunday, May 19, 2024

ODI World Cup | జ‌ట్టును ఆదుకున్న క‌ప్టెన్.. సౌత్ఆఫ్రికా టార్గెట్ ఇదే !

ఐసీసీ వ‌న్డే క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా ఇవ్వాల ధర్మశాల వేదికగా జ‌రుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లు త‌ల‌ప‌డుతున్నాయి. కాగా, ఈ పోరులో టాస్ ఓడి మొట బ్యాటింగ్ కు దిగిన నెద‌ర్లాండ్ జ‌ట్టు 43 ఓవ‌ర్ల‌లో వికెట్ల 8 న‌ష్టానికి 245 ప‌రుగులు చేసింది. అయితే వ‌ర్షం కారంణంగా మ్యాచ్ ఆల‌స్యంగా ప్రారంభం కావ‌డంగ‌తో మ్యాచ్ ను 43 ఓవ‌ర్ల‌లకి కుదించారు ఎంపైర్లు.

నెదర్లాండ్స్ జట్టును కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ ఆదుకున్నాడు. 78 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక‌ రోలోఫ్ వాన్ డెర్ మెర్వే (29), ఆర్యన్ దత్ 23 పరుగులు చశారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్, కగిసో రబాడా, లుంగి ఎన్గిడి తలో రెండు వికెట్లు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement