Monday, May 6, 2024

పోడు భూములపై క్యాబినెట్ సబ్ కమిటీ చర్చ

తెలంగాణలో పోడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల షరిష్కారానికి ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ శుక్రవారం మరో మారు భేటీ అయింది. చైర్మన్‌గా మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలో మంత్రులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, సంబంధిత అధికారులు బీఆర్‌కేఆర్‌ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దీర్ఘకాలికంగా ఉన్న పొడు భూముల సమస్యలపై అవగాహన, పరిష్కారాల అన్వేషణ, సూచనల కోసం కమిటీ చర్చించింది. కాగా, ఈ నెల 18న క్యాబినెట్ సబ్ కమిటీ తొలి భేటీ అయిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: బీఏసీ సమావేశం.. బీజేపీకి అందని ఆహ్వానం

Advertisement

తాజా వార్తలు

Advertisement