Wednesday, May 1, 2024

Inter National : లోయ‌లో ప‌డ్డ బ‌స్సు…15మంది మృతి

సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో ఘోరం జ‌రిగింది. లోతైన లోయలో ట్రక్కు పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. ట్రక్కులో ఉన్న 17 మందిలో ఒక ప్రయాణికుడు, డ్రైవర్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

మాబినే మునిసిపాలిటీకి చెందిన రెస్క్యూ అధికారి మైఖేల్ కబుగాసన్ మాట్లాడుతూ.. ఈ వాహనం ప్రజలను నీగ్రోస్ ద్వీపంలోని పశువుల మార్కెట్‌కు తీసుకువెళుతోంది. రోడ్డు మలుపు వద్ద లారీ డ్రైవర్ అదుపు తప్పి లోతైన గుంతలో పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మాబినే సమీపంలోని కొండ ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement