Friday, May 3, 2024

కరోనా ఉల్లంఘనులకు బంపర్‌ ఆఫర్‌.. వెయ్యికి బదులు 10 చెల్లిస్తే కేసు క్లోజ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కరోనా వైరస్ కార‌ణంగా ప్రజలు బయట విచ్చలవిడిగా తిరగడానికి నియంత్రించే సమయంలో పోలీసులు నమోదు చేసిన కేసులను క్లోజ్‌ చేసుకోవడానికి ప్రభుత్వం ఓ మంచి అవకాశం కల్పించింది. స్థానికంగా ఏ ఏరియాలో అయితే కేసులు నమోదయ్యాయో రూ.1000 ఫైన్‌కు బదులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లోనే వారి ఆధార్‌కార్డు సమర్పించి కేవలం రూ.10 మాత్రమే ఫైన్‌ కట్టి తమ తమ కేసును క్లోస్‌ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. కోర్టుకు వెళ్లే అవసరం లేకుండా కేవలం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లలోనే కేసును కొట్టివేసే అవకాశం కల్పించారు. ఈ నెల 18 వరకు ఈ అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ తేదీల్లో రాని వారికి తర్వాత పాత పద్ధతే అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement