Friday, May 3, 2024

Building collapse – కుప్ప కూలిన భవనం – ఇద్దరు దుర్మరణం

బారాబంకి: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఓ భవనం కుప్పకూలింది. దీంతో ఇద్దరు మరణించగా, 12 మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు మూడంతస్తుల భవనం కూలిపోయిందని జిల్లా ఎస్పీ దినేశ్‌ కుమార్‌ సింగ్‌ చెప్పారు.

ఇప్పటివరకు 12 మందిని శిథిలాల నుంచి క్షేమంగా బయటకు తీసుకొచ్చామని, వారిని దవాఖానకు తరలించామన్నారు.చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారని తెలిపారు. మరో ముగ్గురు శిథిలాల్లో చిక్కుకొని ఉండొచ్చని వెల్లడించారు. సహాయకచర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎఫ్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement