Saturday, July 27, 2024

TS | లాస్యకు బీఆర్ఎస్ ఘన నివాళి.. పాడే మోసిన మాజీ మంత్రులు

బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇవ్వాల (శుక్ర‌వారం) రోడ్డు ప్రమాదంలో మరణించింది. కంటోన్మెంట్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సాయన్న బిడ్డ, దళిత సమాజం నుంచి శాసన సభలో అడుగుపెట్టిన లాస్య నందిత ఆకస్మిక మరణం పొందారు. ఇక‌ ఆమె భౌతిక దేహానికి ఈ రోజు అంత్యక్రియలు నిర్వహించారు. బంధుమిత్రులు, అభిమానులు, రాజకీయ పార్టీల ప్రముఖుల మధ్య ఆమె అంతిమ యాత్ర సాగింది. మారేడ్‌పల్లిలోని స్మశానవాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు ముగిశాయి.

సికింద్రాబాద్ కార్ఖానాలోని ఎమ్మెల్యే నివాసం వద్ద నుంచి ఆమె అంతిమ యాత్ర సాగింది. ఈ యాత్రలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా పలువురు లాస్య నందిత పాడె మోశారు. లాస్య నందిత మృతికి అన్ని పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావులు లాస్య నందిత భౌతిక దేహానికి నివాళులు అర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement