Saturday, July 27, 2024

TS | ఎమ్మెల్యే లాస్య నందిత మృతి.. పీఏపై కేసు నమోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం‌లో మృతిచెందిన. అయితే ఆమె మృతిపై ఆమె సోదరి నివేదిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పఠాన్ చెరు పోలీసులు లాస్య పీఏ ఆకాష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరికీ గాయాలు మాత్రమే త‌గిలాయని పీఏ ఆకాశ్‌ తమకు మెసేజ్‌ చేసి లొకేషన్‌ను షేర్‌ చేశారని, అయితే ఘటనా స్థలానికి వెళ్లేసరికి కారు నుజ్జునుజ్జు అయ్యి ఉందని ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement