Friday, April 26, 2024

Breaking : ఏ ఒక్క స్కూల్ ని మూసివేయ‌లేదు-చంద్ర‌బాబుపై ఫైర్ అయిన విజ‌య‌సాయిరెడ్డి

మా హ‌యాంలో ఒక్క డిస్ట‌ల‌రీకి అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు. ఈమేర‌కు ఆయ‌న తాడేప‌ల్లిలో మాట్లాడారు.. టిడిపి హ‌యాంలోనే కొత్త డిస్ట‌ల‌రీల‌కు అనుమ‌తి ఇచ్చార‌న్నారు. టిడిపి అధినేత చంద్ర‌బాబు క‌నీసం అవ‌గాహ‌న లేకుండా విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్నారు. రాష్ట్రంలో ఒక్క స్కూల్ ని కూడా మూసివేయ‌లేద‌న్నారు. రేప‌టి నుంచి వైపీసీ ప్లీన‌రీ జ‌ర‌గ‌బోతోంది. చంద్ర‌బాబు క‌నీసం అవ‌గాహ‌న లేకుండా విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్నారు.ఎనిమిది వేల గ్రామాల్లో స్కూళ్లు మూయించామ‌ని చెబుతున్నార‌ని మండిప‌డ్డారు. ఇంటికో ఉద్యోగం అన్నారు.నిరుద్యోగ భృతి ఇస్తామ‌న్నారు..మీరిచ్చిన హామీల‌ని అమ‌లు చేశారా అని నిల‌దీశారు విజ‌య‌సాయిరెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement