Thursday, April 25, 2024

Breaking : రెండు కార్లు ఢీ.. ఇద్దరు మృతి.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

మేడ్చల్ జిల్లా : కీసర పోలీస్ స్టేషన్ పరిధి ఓ ఆర్ ఆర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. బెంజ్ కారు అదుపు తప్పి డివైడర్ ఢీ కొని , ఎదురుగా వస్తున్న మరో కారు టాటా విస్టా ను ఢీ కొట్టింది..ఈ ప్రమాదం కీసర ఓ అర్ ఆర్ సర్కిల్ సమీపంలో చోటు చేసుకుంది. ఘట్కేసర్ నుండి వస్తున్న బెంజ్ కార్ , షామీర్పెట్ వైపు నుండి వస్తున్న టాటా కార్ ను డీ కొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా , మరో ఎనిమిది మంది కి తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement