Saturday, April 20, 2024

Breaking : సోషల్ మీడియా వేదికగా – మావోయిస్టు కరపత్రాల కలకలం

వాజేడు (ప్రభ న్యూస్): మావోయిస్టు కరపత్రాలు సోషల్ మీడియా వేదికగా ఏజెన్సీ ప్రాంతంలో కలకలం రేపుతున్నాయి. ఈనెల 28 నుండి ఆగస్టు 3వ తేదీ వరకు జరగనున్న మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ పేరున కరపత్రాలు వెలువడ్డాయి. మావోయిస్టు కరపత్రాలలో ఇలా పొందుపరిచి ఉన్నాయి. జూలై 28 నుండి ఆగస్టు 3వ తేదీ వరకు అమరవీరుల వారోత్సవాలను జరుపుకోండి. గ్రామ గ్రామాన అమరుల అద్దిన నెత్తుటి జెండాను ఎగరవేయండి. దోపిడి పీడన నుండి మన దేశ విముక్తి నే కాదు ఎల్లలు దాటి ప్రపంచ ప్రజల విముక్తిని కాంక్షిస్తూ ప్రాణాలు అర్పించిన మహోన్నత ప్రజాయుద్ధ వీరుల స్మృతులను యాది చేసుకుందాం.

వారిచ్చిన సంకల్పంతో సాయుధ పోరులో ముందుకు సాగుదాం. మన ప్రియతమ నాయకులు కామ్రేడ్ సిద్ధబోయిన సారక్క కామ్రేడ్ కత్తి మోహన్ రావు డప్పు రమేష్ ఎర్రం రెడ్డి అనసూయమ్మ ఆలూరి లలిత వేలాద్రి సమ్మన్న అమర హై అమరవీరులందరికీ విప్లవ జోహార్ లార్పిద్దాం. నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి సిపిఐ మావోయిస్టు జిందాబాద్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలపెడుతున్న దమన కాండను ప్రతికటిద్దాం.. ప్రజా యుద్ధాన్ని నిర్మూలించ తలపెట్టిన విప్లవ ప్రతుఘాతుక వ్యూహాత్మక సమాధానం దాడిని ఓడిద్దాం. మావోయిస్టు పార్టీని కాపాడుకుంటూ దేశాన్ని విముక్తి చేద్దాం అంటూ కరపత్రాలలో పేర్కొన్నారు దీనితో ఏజెన్సీ ప్రాంతంలో బయనక వాతావరణం ఏర్పడింది ఈ క్షణం ఏం జరగబోతుందో నన్ను టెన్షన్ టెన్షన్ తో ఏజెన్సీ ప్రజలు కాలం గడుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement