Saturday, May 11, 2024

Breaking : సాయినాథుని ద‌ర్శించుకున్న ‘సురేఖ‌వాణి’

నేడు షిర్డీ సాయిబాబా ద‌ర్శ‌నం చేసుకుంది న‌టి సురేఖ వాణి. సాయినాథుని ద‌ర్శ‌నం బాగా జ‌రిగింద‌ని తెలిపారామె. ద‌ర్శ‌నం అనంత‌రం సురేఖ‌వాణికి ఎన్సీపీ లీడ‌ర్ ర‌మేష్ బాబు స‌న్మానం చేసి శాలువాని క‌ప్పారు. కాగా తీర్థ‌ప్ర‌సాదాల‌ను సురేఖ‌వాణికి అంద‌జేశారు. అక్క‌, వ‌దిన‌, భార్య క్యారెక్ట‌ర్ల‌తో సినీ ప‌రిశ్ర‌మ‌లో గుర్తింపుని తెచ్చుకుంది సురేఖ‌వాణి. త‌న కుమారైతో పాటు ప‌లు వీడియోలు చేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ఈ వీడియోల‌కి నెటిజ‌న్స్ ప‌లు కామెంట్స్ పెడుతుంటారు. త‌ల్లికాదు అక్క‌లా ఉంద‌నేలా త‌న ప‌ర్స‌నాలిటీని మెయింటైన్ చేస్తుంది సురేఖావాణి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement