Sunday, April 28, 2024

Breaking News… Bihar – పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌….

పాట్నా – నార్త్ ఈస్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ రైలు బీహార్‌లో ప్రమాదానికి గురైంది. ట్రైన్‌ నంబర్ 12506కి చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈదుర్ఘటన బక్సర్‌లోని రఘునాథ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది వెంటనే రైల్వే అధికారులకు సమాచారం చేరవేశారు. వెంటనే రైల్వే అధికారులు సహాయక బృందాలతో ఘటన స్తలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు

.రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు. రాత్రి సమయం కావడంతో బోగీలు పట్టాలు తప్పడంతో లోపలున్న ప్రయాణికులు బయటకు వచ్చారు. ఈప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారు. ఎవరికైనా ప్రాణపాయం తలెత్తిందా అనే విషయాలు ఇంకా తెలియరాలేదు

Advertisement

తాజా వార్తలు

Advertisement