Friday, April 26, 2024

Breaking : ప్రేమోన్మాది ఘాతుకం… త‌ల్లీ,కూతుళ్ల‌పై సుత్తితో దాడి..

తూర్పుగోదావ‌రి జిల్లాలో ప్ర‌మోన్మాది ఘాతుకానికి పాల్ప‌డ్డారు. త‌ల్లీ,కూతుళ్ల‌పై సుత్తితో దాడి చేశారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. కడియం మండలం కడియపులంకలో అర్ధరాత్రి ఇంటికి వెళ్లి సుత్తితో తల్లి, ఇద్దరు కూతుర్లపై ప్రేమోన్మాది దాడి చేశాడు. దీంతో వారు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వెంట‌నే తల్లీ కూతుళ్లను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘాతుకానికి పాల్ప‌డిన యువ‌కుడు పొట్టిలంక‌ గ్రామానికి చెందిన‌ట్లు గుర్తించారు. దాడి అనంతరం యువ‌కుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇత‌డిని కూడా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. స‌మాచారం అందుకున్న పోలీలు ఘ‌ట‌న‌పై వివ‌రాలు సేక‌రించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement