Friday, March 29, 2024

భారత్ లో కొత్తగా 201 కోవిడ్ కేసులు..

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. మన దేశంలో కూడా మళ్లీ కరోనా కేసులు మెళ్లిగా పుంజుకుంటున్నాయి. తాజాగా మన దేశంలో కొత్త‌గా గ‌త 24 గంట‌ల్లో 201 కోవిడ్ పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయని కేంద్ర ఆరోగ్య‌శాఖ ఈ విష‌యాన్ని తెలిపింది. దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం 3397 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ పేర్కొన్న‌ది. వైర‌స్ నుంచి రిక‌వ‌రీ అవుతున్న రేటు 98.8 శాతంగా ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది. అలాగే గత 24 గంట‌ల్లో 184 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement