Sunday, June 16, 2024

Breaking | గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 22 మంది సజీవ దహనం

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో భారీ అగ్ని ప్రమాదం జ‌రిగింది. ఇవ్వాళ (శనివారం) సాయంత్రం టీఆర్‌పీ గేమింగ్‌ జోన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో చిక్కుకుని 22 మంది సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. ప్రమాదం గురించి తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

కాగా, మృతుల సంఖ్యను సరిగ్గా అంచనా వేయలేమని ఫైర్‌ స్టేషన్‌ ఆఫీసర్‌ ఆర్‌ఏ జోబన్‌ తెలిపారు. ప్రమాద స్థలం నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నామని.. సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతుందని చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement