Monday, April 29, 2024

Breaking : ఇంజక్షన్ విక‌టించి బాలుడి మృతి

హాసన్ పర్తి (ప్రభ న్యూస్) : ఇంజ‌క్ష‌న్ విక‌టించి బాలుడు మృతి చెందిన ఘ‌ట‌న‌ హనుమకొండ జిల్లా హాసన్ పర్తి మండలలో చోటుచేసుకుంది. మండ‌ల‌ కేంద్రానికి చెందిన మీసరకొండ అవినాష్ (12)కు జ్వ‌రం రావ‌డంతో తల్లితండ్రులు ఆదివారం సాయంత్రం హాసన్ పర్తిలోని స్థానిక ఆర్ఎంపి వైద్యుడు శంకర్ వద్దకు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు జ్వరం అని చెప్పి రెండు ఇంజక్షన్లు ఇచ్చాడు. ఆర్ఎంపి ఇచ్చిన ఇంజక్షన్ వికటించడంతో సోమవారం తెల్లవారుజామున బాలుడు మృతి చెందాడు. అవినాష్ వరంగల్ జిల్లా మామనూర్ లోని మహాత్మ జ్యోతిరావు పూలె గురుకులంలో ఆరో తరగతి చదువుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement