Wednesday, May 1, 2024

Breaking : హనుమకొండలో దారుణం.. సుపారీ గ్యాంగ్‌తో భర్తను హతమార్చిన భార్య..

హనుమకొండలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తనే సుపారీ ఇచ్చి హత్య చేయించి.. భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. సెప్టెంబర్‌లో భర్త వేణును సుపారీ గ్యాంగ్‌తో భార్య హత్య చేయించింది. ఆ మృతదేహాన్ని మానేరు వాగులో సుపారీ గ్యాంగ్‌ పడేసింది. అనంతరం భర్త కనిపించడంలేదని భార్య సుస్మిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో అసలు నిజాలు వెలుగుచూశాయి. రూ.4 లక్షలు సుపారీ ఇచ్చి భర్తను భార్య సుస్మిత హత్య చేయించినట్లు తెలిసింది. సుస్మిత తోపాటు ముగ్గురు నిందితలను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement