Thursday, May 2, 2024

BREAKING : యాదాద్రిలో తడిబట్టలతో బండి ప్రమాణం

యాదాద్రి : స్వామిజీలతో కలిసి తమ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని టీ-ఆర్‌ఎస్‌ నేతలు చేస్తోన్న ఆరోపణలపై టీబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సవాల్‌ చేసిన విషయం విదితమే.. ఇదంతా వాస్తవం కాదని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తానని అన్నారు. ఇందులో భాగంగా ఈరోజు బండి సంజయ్‌ యాదాద్రికి చేరుకున్నారు. నరసింహ స్వామి సన్నిదిలో బండి సంజయ్‌ ప్రమాణం చేస్తూ.. దమ్ముంటే టీఆర్‌ఎస్‌ అధినేత యాదాద్రి నరసింహుడి ఆలయానికి వచ్చి నాతో కలిసి ప్రమాణం చేయాలి. ఫామ్‌ హౌస్‌ డీల్‌ తమది కాదని చెప్పేందుకే ప్రమాణం చేసేందుకు ఇక్కడికి వచ్చా. భారతీయ జనతా పార్టీ నాయకుల మీద వస్తున్న ఆరోపణలు సరికాదు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవడానికి బేరసారాలు నడిపారని చెప్పి తప్పుడు ఆరోపణలను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గానీ, టీఆర్‌ఎస్‌ నేతలు చేయడం జరుగుతుంది. ఈ విషయంలో బీజేపీకి గానీ, బీజేపీ నేతలకు గానీ ఎలాంటి సంబంధం లేదు, అటువంటి ఆలోచన కూడా బీజేపీకి లేదు. ఈ మేరకు నిన్న నేను సవాల్‌ విసరడం జరిగింది. మా ఇలవేల్పు అయిన లక్ష్మీనరసింహ స్వామి పాదాల వద్ద నేను తడిబట్టలతో ఉండి.. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, అవన్నీ తప్పుడు ఆరోపణలు అని ప్రమాణం చేస్తున్నా అని బండి సంజయ్‌ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement