Thursday, May 2, 2024

Jaggi Vasudev | సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు బ్రెయిన్‌ సర్జరీ..

ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో మెదడు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ నెల 17న మెదడులో బ్లీడింగ్ కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది.

గత నాలుగు నెలలుగా విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నాడని, పరీక్షల్లో మెదడులో రక్తస్రావం అయినట్లు తేలిందని వైద్యులు తెలిపారు. అయితే జగ్గీ వాసుదేవ్ కోలుకుంటున్నారని ఈషా ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. అతడికి వెంటిలేటర్‌ను కూడా తొలగించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement