Tuesday, May 7, 2024

ADB: పోలీస్ స్టేషన్ లో బ్రెయిన్ స్ట్రోక్… యువకుడు మృతి

బెల్లంపల్లి, ఆగస్టు 28 (ప్రభ న్యూస్) : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కీర్తి అంజి (25) అనే యువకుడు బ్రెయిన్ స్ట్రోక్ తో మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే స్టేషన్ ఏరియాకి చెందిన కీర్తి అంజి అనే యువకుడు ఎలాంటి పనిచేయకుండా, నిత్యం మద్యం సేవిస్తూ ఉండేవాడు. అతనికి అనేకసార్లు అతడి అన్నయ్య కీర్తి లక్ష్మణ్, బాబాయ్ లక్ష్మి నరసయ్యలు ఇలాంటి చెడు అలవాట్లు మానుకొని ఏదైనా పని చేసుకోవాలని సూచించినప్పటికీ అంజి తీరు మారలేదు.

నిత్యం తాగి వచ్చి గొడవ చేస్తుండటతో విసుగు చెందిన వారిరువురూ అంజిపై బెల్లంపల్లి టూ టౌన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అంజిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ లో కూర్చున్న అంజికి అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో గమనించిన సిబ్బంది వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అంజి మృతదేహాన్ని డీసీపీ సుదీర్ కేకన్ రాంనాథ్, ఏసీపీ సదయ్య పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement