Sunday, May 5, 2024

Srisailam లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. 11 రోజులపాటు నిర్వాహణ

అష్టాదశ పీఠాలలో ఒకటైన భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి కొలువై ఉన్న శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవ నిర్వహణలో భాగంగా ఆలయ ధర్మకర్తల అధ్యక్షులు, ఆలయ అధికారులు, అర్చకులు, అర్చకులు, వేద పండితుల సమక్షంలో యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడం విశేషం.

శ్రీశైలం ఆలయ మహిమాణిత్వం

శైవక్షేత్రాలలో శ్రీశైలం తాళమాణికం. మల్లికార్జున మహాలింగ చక్రవర్తి.. ఆదిదేవుడైన పరబ్రహ్మ పవిత్ర చిహ్నంగా ఇక్కడ కొలువై ఉన్నాడు. ఈ క్షేత్రం ద్వాదశ (12) జ్యోతిర్లింగాలలో రెండవది. శ్రీభారమాంబదేవి శక్తిపీఠం కూడా ఇదే. అన్ని వేదాలకు మూలం, అటు జ్యోతిర్లింగం, ఇటు శక్తి పీఠం ఒకే గిరిశృంగం మీద వెలసిన తావు ఇది. సకల లోకారాధ్యంగా, త్రైలోక్య పూజితంగా భాసిల్లుతోంది.

మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం ప్రారంభమైన శ్రీశైల బ్రహ్మోత్సవాలు ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగాయి. అంటే 11 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలిరోజు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆగమ శాస్త్రానుసారం ధర్మకర్తల మండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారి, అర్చకులు ఉదయం యాగశాలలోకి ప్రవేశించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ విధంగా తొలిరోజు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనా ఈ నెల 11వ తేదీ రాత్రి జరిగే పుష్పోత్సవం, శయోనోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement