Saturday, April 27, 2024

WPL | గుజ‌రాత్‌పై యూపీ వారియర్స్ విజయం !

మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌లో భాగాంగా ఇవ్వాల (శుక్రవారం) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ మరో ఓటమిని చవిచూసింది. గుజరాత్ జట్టుపై యూపీ వారియర్స్ మహిళల జట్టు విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. దీంతో 143 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్ జట్టు 16 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి మ్యాచ్‌ని ముగించింది.

యూపీ వారియర్స్ లో గ్రేస్ హారిస్ ( 60 నాట్ అవుట్ ) హాఫ్ సెంచరీతో అదరకొట్టింది. అలిస్సా హీలీ (33) పరుగులతో ఆకట్టుకుంది. ఇక, చమరి అతపత్తు (17), దీప్తి శర్మ ( 17 నాట్ అవుట్ ) పరువాలేదనిపించారు. గుజరాత్ బౌలర్లలో తనూజా కన్వర్ 2 వికెట్లు తీయగా.. మేఘనా సింగ్, కాథరిన్ బ్రైస్ చరో వికెట్ దక్కించుకున్నారు.

అంతకముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ బ్యాటర్లలో ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (35), ఆష్లే గార్డనర్ (30), లారా వోల్వార్డ్ (28) పరుగులతో ఆకట్టుకున్నారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఇక‌ యూపీ వారియర్స్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టగా.. రాజేశ్వరి గయక్వాడ్ 1 వికెట్ తీసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement