Friday, April 26, 2024

ఫైనల్‌లో భారత్ గెలిస్తే బట్టలు విప్పేస్తా: పూనం పాండే

పూనం పాండే.. ఈ పేరు గురించి తెలియనివారు ఉండరు. ఎందుకంటే 2011లో భారత్ ప్రపంచ కప్ గెలిస్తే బట్టలు లేకుండా మైదానంలో తిరుగుతానని ప్రకటించి అప్పట్లో సంచలనమైంది. ఆమె మరోసారి క్రికెట్ అభిమానులను రెచ్చకొడుతోంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ గెలిస్తే బట్టలు విప్పేస్తానని మళ్లీ చెప్పాలా? అంటూ కామెంట్ చేసింది. అయితే ఈ మ్యాచ్ గురించి తనకు పూర్తిగా తెలియదని, ఇంటికి వెళ్లి తెలుసుకుంటానని మీడియాకు బదులిచ్చింది.

అయితే పూనంపాండే వ్యాఖ్యలపై ఆమె భర్త సామ్ బాంబే స్పందించాడు. ‘వద్దు నువ్వు బట్టలు విప్పకు.. ఈసారి నీకు బదులుగా నేను నగ్న ప్రదర్శన చేస్తా’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో పూనం పాండే.. తన భర్త నగ్న ప్రదర్శన చేస్తే భారత్ ఓడిపోతుందని, దయచేసి అలాంటి పనిచేయవద్దని ఛలోక్తులు విసిరింది. కాగా పూనంపాండే దంపతులపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పుగా అనిపించడంలేదా అంటూ నిలదీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement