Saturday, April 20, 2024

ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోస్ కు అంబాసిడర్ గా ఉపాసన

హీరో రామ్ చ‌ర‌ణ్ భార్య, అపోలో హాస్పిట‌ల్స్ డైరెక్ట‌ర్ ఉపాస‌న వ‌ర‌ల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఇండియా అసోసియేష‌న్‌ త‌ర‌ఫున‌ ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోస్ కార్య‌క్ర‌మానికి ప్ర‌చార‌క‌ర్త‌గా నియ‌మితుల‌య్యారు. సినిమా రంగంలో ఏర్పడిన కొత్త పరిచయాలతో మరింత విస్తారంగా సేవా కార్యక్రమాలను, ఆరోగ్యానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ను చేపడుతున్నారు.విశేషం ఏమంటే… ప్రకృతిని ప్రేమించడం కూడా ఉపాసనకు మొదటి నుండి అలవాటు. ఏ మాత్రం సమయం చిక్కినా భర్త రామ్ చరణ్ తో కలిసి ఏదో ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళి ప్రకృతితో మమేకమై వస్తుంటారు ఉపాసన. బహుశా అందుకేనేమో ఆమెను వైల్డ్ లైఫ్ ఫండ్ ఇండియా సంస్థ భారత అంబాసిడర్ గా నియమించింది.

‘ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోస్’ కు ఇప్పుడు ఉపాసన ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్. దేశవ్యాప్తంగా ఉన్న అడవులను సంరక్షించడం, అందులోని వన్య ప్రాణులను కాపాడటం, అటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న వారికి బాసటగా నిలవడం ఉపాసన కర్తవ్యం. ఏ పనిని తలపెట్టినా చిత్తశుద్ధితో నెరవేర్చే ఉపాసన ఈ కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారనడంలో సందేహం లేదు. దీనిపై ఉపాస‌న స్పందిస్తూ… క‌రోనా వేళ ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఫ్రంట్ లైన్ వారియర్స్ నిరంత‌రం పోరాడుతున్నార‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement