Monday, April 29, 2024

హీరోయిన్ అనన్య పాండే నివాసంలో విషాదం

బాలీవుడ్ హీరోయిన్ అన‌న్య పాండే ఇంట్లో విషాదం నెల‌కొంది. ఆమె నాన‌మ్మ వ‌యోభారం కార‌ణంగా క‌న్నుమూశారు. అనన్య తండ్రి చుంకీ పాండే ఆమె అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించారు. తన తల్లి స్నేహలతా పాండేకు చుంకీ పాండే తలకొరివి పెట్టారు. అంత్య‌క్రియ‌లకు అన‌న్య‌తో పాటు ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. వీటికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చల్ చేస్తున్నాయి.

అనన్య పాండే ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కుతున్న లైగ‌ర్ సినిమాలో క‌థానాయికగా న‌టిస్తోంది. లాక్‌డౌన్‌కు ముందు ముంబైలోఈ మూవీకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. ఆ స‌మయంలో పూరీ జ‌గ‌న్నాథ్‌, ఛార్మి, విజ‌య్ దేవ‌ర‌కొండ అన‌న్య ఇంట్లో సంద‌డి చేయ‌గా, అందుకు సంబంధించిన ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. త్వ‌ర‌లో లైగ‌ర్ మూవీ త‌దుప‌రి షెడ్యూల్ మొద‌లు పెట్ట‌నున్న‌ట్టు స‌మాచారం.

ఈ వార్త కూడా చదవండి: ఈనెల 12న అభిమానులతో భేటీ కానున్న రజనీకాంత్

Advertisement

తాజా వార్తలు

Advertisement