పొగమంచు కారణంగా బొలెరో వాహనం రోడ్డు ప్రమాదానికి గురయింది. ఈ వాహనంలో 20మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పొగమంచుతో దారి సరిగ్గా కనిపించక ఈ వాహనం ప్రమాదానికి గురయింది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల మండలం కొడపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.ఈ ఘటనలో మిగతావారంతా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నాఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement