Tuesday, May 7, 2024

మౌలిక సదుపాయాల కల్పనకు కృషి.. పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి

మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం అం పెద్దపల్లి మండలం ముత్తారం ధర్మాబాద్ గ్రామాల్లో ఎస్డీఎఫ్ నిధులు 34 లక్షల 20 వేల రూపాయలతో నిర్మించనున్న రోడ్ల న పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ లతోపాటు ఇతర సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు.

ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, ప్రపంచంలో లో ఎక్కడా లేని పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తూ నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement