Wednesday, May 1, 2024

త‌మిళ‌నాడు – క్రాక‌ర్స్ గోడౌన్ లో పేలుడు.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం

చెన్నై: త‌మిళ‌నాడులోని ధ‌ర్మ‌పురి జిల్లాలో క్రాకర్స్ గోడౌన్‌లో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు మహిళలు మరణించారు. నేటి ఉద‌యం నాగరసంపట్టి సమీపంలోని ప్రైవేట్‌ క్రాకర్స్‌ తయారీ పరిశ్రమకు చెందిన గోడౌన్‌లో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మ‌ర‌ణించ‌గా. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement