Friday, April 26, 2024

ముగ్గురు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్ధుల ఏక‌గ్రీవ ఎన్నిక

హైద‌రాబాద్ – ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు నేటితో ముగిసింది. ఇత‌ర పార్టీల నుంచి ఎవ‌రూ నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌లేదు. దీంతో అధికార పార్టీ త‌ర‌పున నామినేష‌న్లు దాఖ‌లు చేసిన దేశ‌ప‌తి శ్రీనివాస్ , న‌వీన్ కుమార్ , చ‌ల్లా వెంక‌ట్రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ ముగ్గురికి రిట‌ర్నింగ్ అధికారి గెలుపు ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను అంద‌జేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement