Friday, April 26, 2024

తెలంగాణ లో ఎక్కువవుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు

ఓవైపు కరోనా మహమ్మారి కలవర పెడుతుంటే… కొత్తగా బ్లాక్ ఫంగస్ భయాందోళనకు గురి చేస్తోంది. కరోనా నుంచి కోలుకున్న చాలామందిని బ్లాక్ ఫంగస్ వెంటాడుతోంది. ఇక తెలంగాణలో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. నిన్న ఒక్కరోజే నిజామాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులకు బ్లాక్ ఫంగస్ సోకింది.

అలాగే నల్లగొండ జిల్లాకు చెందిన ఒకరు బ్లాక్ ఫంగస్ తో పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలతో 16 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే కోఠి ఆస్పత్రిలో నిన్న ఒక్కరోజే ఇరవై ఐదు కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పది మంది బ్లాక్ ఫంగస్ కారణంగా చనిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement