Sunday, April 28, 2024

BJP చెన్నై సౌత్ లో నామినేష‌న్ వేసిన త‌మిళి సై …

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై నేడు నామినేష‌న్ దాఖ‌లు చేశారు.. త‌మిళ‌నాడులోని చెన్నై సౌత్ సెగ్మెంట్ లో ఆమె బిజెపి అభ్య‌ర్ధిగా పోటీ చేస్తున్నారు.. ఈ క్ర‌మంలోనే ఆమె నేడు త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను రిట‌ర్నింగ్ అధికారికి అంద‌జేశారు.. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తమిళిసై పంచుకున్నారు. ‘చెన్నై సౌత్ నియోజకవర్గానికి ఎన్డీఏ అలయెన్స్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను’ అని తమిళిసై ట్వీట్ చేశారు. ఇక, ఎంపీ ఎన్నికల వేళ తమిళనాడులో బీజేపీ ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా కీలక నేతలకు ఈ సారి కాషాయ పార్టీ ఎంపీ టికెట్లు కేటాయించింది. ఇందులో భాగంగానే తమిళిసైని గవర్నర్‌గా తప్పించి మరి ఎంపీగా బరిలో నిలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement