Thursday, April 25, 2024

National : ఇవాళ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

ఇవాళ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల జాబితా ఇవాళ సాయంత్రం వెలువడే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. కాగా, ని ఆదివారం బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీలు నగేష్‌, సీతారాం నాయక్‌, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావ్‌లు బీజేపీలో చేరారు.

- Advertisement -

దీంతో, వీరికి టికెట్స్‌ ఇస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక, ఇప్పటికే బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు బీబీ పాటిల్‌, రాములు తనయుడు భరత్‌ టికెట్‌ దక్కించుకున్నారు.
టికెట్ కోసం రేసులో ఉన్న ఆశావహులు..

మహబూబ్‌నగర్‌: డీకే అరుణ/ జితేందర్ రెడ్డి

మెదక్: రఘునందన్ రావు/ అంజిరెడ్డి

ఆదిలాబాద్: నగేష్/సోయం బాపురావు/ అభినవ్ సర్దార్

మహబూబాబాద్: సీతారాం నాయక్

ఖమ్మం: జలగం వెంకట్రావు

నల్గొండ: శానం సైదిరెడ్డి

వరంగల్: కృష్ణ ప్రసాద్

పెద్దపల్లి: ఎస్. కుమార్

Advertisement

తాజా వార్తలు

Advertisement