Tuesday, May 21, 2024

బిర్జు మహారాజ్ మృతికి ఉపరాష్ట్రపతి వెంకయ్య సంతాపం

కథక్ విద్వాంసుడు.. లెజెండ్​ బిర్జూ మహారాజ్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సోమవారం సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి కళా ప్రపంచానికి తీరని లోటు అని అన్నారు. బిర్జూ మహారాజ్ సోమవారం తెల్లవారుజామున తన స్వగృహంలో చనిపోయారు. “తన ప్రత్యేక శైలితో ప్రపంచ ప్రఖ్యాతి గాంచారని, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ప్రేరణగా నిలిచారని కొనియాడారు. అతని మరణం కళల ప్రపంచానికి తీరని లోటు” అని ఉపరాష్ట్రపతి సెక్రటేరియట్ ట్వీట్ చేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement