Sunday, April 28, 2024

MMTS Trains Alert: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు అలర్ట్.. 36 రైలు సర్వీసులు రద్దు..

హైదరాబాద్‌ ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సోమవారం (జనవరి 17) సికింద్రాబాద్ పరిధిలో 36 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించింది. ప్రస్తుతం సికింద్రాబాద్ పరిధిలో ట్రాక్ మరమ్మత్తుల పనులు, సాంకేతిక కారణాలతో సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రస్తుతం 79 సర్వీసులకు 36 సర్వీసులను రద్దు చేసినట్లు పేర్కొంది.

లింగంపల్లి-నాంపల్లి రూట్‌లో9 సర్వీసులు, నాంపల్లి-లింగంపల్లి వైపు9, ఫలక్‌నుమా-లింగంపల్లిలో 8, లింగంపల్లి-ఫలక్‌నుమా వైపు 8, సికింద్రాబాద్‌-లింగంపల్లి మార్గంలో 1, లింగంపల్లి-సికింద్రాబాద్‌ రూట్‌లో 1 సర్వీసును రద్దు చేసినట్లుగా తెలిపింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement