Thursday, April 25, 2024

కాంగ్రెస్ కు బిగ్ షాక్.. దాసోజు శ్రవణ్ రాజీనామా..

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. నిన్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేయ‌గా, తాజాగా ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి దాసోజు శ్ర‌వ‌ణ్ రాజీనామా చేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో ప్రారంభమైన రాజీనామాల పర్వం ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. ఆ తరువాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన పార్టీ మారుతారేమోననే ప్రచారాన్ని బలపరిచేలా ఉన్నాయి. ప్రస్తుతం దాసోజు శ్రవణ్ కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టి.కాంగ్రెస్‌లో విజయారెడ్డి చేరికపై దాసోజు శ్రవణ్‌ అసంతృప్తితో ఉన్నారు. దీంతో నేడు ఆయన తన రాజీనామాను ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement