ఐపీఎల్-16 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా ఐడెన్ మర్క్రమ్ వ్యవహరిస్తున్నాడు. అయితే, అతడు తొలిమ్యాచ్కు అందుబాటులో ఉండటం లేదు. దీంతో ప్రారంభ మ్యాచ్ (రాజస్థాన్ రాయల్స్తో)కు భువనేశ్వర్ కుమార్ కెప్టెన్గా వ్యవహరిస్తాడని జట్టు యాజమాన్యం తెలిపింది. నెదర్లాండ్స్తో జరిగే రెండు వన్డేల సిరీస్కోసం మర్క్రమ్ దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. ఈ ఏడాది చివర్లో భారత్లో జరగనున్న వన్డే ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించేందుకు ఈ సిరీస్ సఫారీలకు చాలా కీలకం. ఏప్రిల్ 3న భారత్కు వస్తాడు. 2013లో భువీ ఎస్ఆర్హెచ్ జట్టులో ఉన్నాడు. గతంలో కెప్టెన్గాను వ్యవహరించాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement