Friday, May 17, 2024

TS | భారత జాగృతి అన్నీ కమిటీలు రద్దు : ఎమ్మెల్సీ కవిత

భారత్ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో భారత్ జాగృతికి సంబంధించిన అన్ని కమిటీలను రద్దు చేస్తూ ఈరోజు ప్రకటన విడుదల చేశారు.

గతేడాది ఆగస్టులో భారత జాగృతి సంస్థ కార్యకలాపాల కోసం వివిధ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేశారు. కాగా, భారత జాగృతి సంస్థలోని అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు ఈరోజు ప్రకటించారు. విదేశీ, జాతీయ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్టు కవిత కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. కమిటీల రద్దు వెంటనే అమల్లోకి వస్తుంద‌ని తెలిపారు. ఈ కమిటీల రద్దుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement