Friday, May 3, 2024

TS | భక్తులకు గుడ్ న్యూస్.. తలంబ్రాల బుకింగ్ గడువు పొడిగింపు

ఈ నెల 17న రామనవమి సందర్భంగా భద్రాచలంలో జ‌రిగిన‌ సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు నేరుగా ఇంటికే అందించేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. తొలుత ఈ నెల 18 వరకే భక్తులకు బుకింగ్ చేసుకునే అవకాశం ఉండగా.. ఈ నెల 25 వరకూ బుక్ చేసుకోవచ్చని సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలు రూ.151లకే పొందే సదవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు.

టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ విభాగం వెబ్ సైట్ https://www.tsrtclogistics.in ను సందర్శించి తలంబ్రాలు బుక్ చేసుకోవాలని సజ్జనార్ తెలిపారు. అలాగే, ఆఫ్ లైన్ లో తలంబ్రాలు బుక్ చేసుకోవాలనుకునే వారు 040 – 23450033, 040 – 690000, 040 – 694400669 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement