Sunday, April 28, 2024

Breaking : యాదాద్రిలో మంత్రి పువ్వాడపై తేనెటీగల దాడి.. (వీడియో)

యాదాద్రి ఆలయం పునః ప్రారంభం సందర్భంగా ఈరోజు జరిగిన మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై తేనెటీగలు దాడి చేశాయి. ఆలయ పంచతల గోపురంపై పూజా క్రతువులో ఉన్న మంత్రి, వేద పండితులు, మంత్రి వ్యక్తిగత భద్రత సిబ్బందిపైన తేనెటీగల‌ దాడి జరిగింది. ఉదయం 11:45 గంటల సమయంలో పూజా కార్యక్రమంలో నిమగ్నమైన మంత్రి పైకి ఒక్కసారిగా తేనెటీగలు దూసుకొచ్చాయి. తేనెటీగలు దాడి చేసినప్పటికీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భక్తిభావంతో మహాకుంభ సంప్రోక్షణ పూజా కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రాథమిక చికిత్స కోసం పూజా క్రతువును ముగించుకొని హుటాహుటిన మంత్రి అజయ్ హైదరాబాద్ కు బయల్దేరివెళ్లారు.

ఈ వీడియో చూడాలంటే… డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ప్రభన్యూస్.కమ్ లో చూడండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement