Friday, May 3, 2024

కార్యదర్శుల సమస్యలపై కేసీఆర్ కు బండి సంజ‌య్ లేఖ

పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై సీఎం కేసీఆర్ కి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నిరవధిక సమ్మె చేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు మద్దతు తెలిపారు బండి సంజయ్. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కార్యదర్శుల న్యాయమైన కోర్కెలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో అన్ని శాఖల ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు బండి సంజయ్.

పంచాయతీ కార్యదర్శులు తల్చుకుంటే ప్రభుత్వం సంగతి ఏమైతదో తెలుసుకోవాలన్నారు. గొడ్డు చాకిరీ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డులు తెచ్చారని.. ఎక్కడా లేని విధంగా నాలుగేళ్లు ప్రొబేషనరీ ఏంటి ? అని ప్రశ్నించారు. ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయినా ఇంకా ఎందుకు రెగ్యులర్ చేయడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఎన్నికలకు ఐదు నెలల సమయం ఉందని.. కేసీఆర్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నారు. పంచాయతీ కార్యదర్శుల ఉద్యమానికి బీజేపీ పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుందని బండి సంజ‌య్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement