Saturday, April 20, 2024

అయ్యప్ప నామస్మరణతో ఆయుష్షు పెరుగుతుంది : స్పీక‌ర్ పోచారం

బాన్సువాడ : అయ్యప్ప నామస్మరణతో ఆయుష్షు పెరుగుతుందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప పూజ మందిరం నిర్మాణం కోసం అయ్యప్ప భక్తుల కోరిక మేరకు మహా మండల పూజలో వాగ్దానం ఇచ్చానని, ఇప్పుడు నిధులు మంజూరు చేసి భూమి పూజ చేసుకోవడం జరిగిందన్నారు. 30 లక్షల వ్యయంతో ఈ పూజ మందిరం నిర్మాణం కోసం మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు అధ్యక్షులు ముదిరెడ్డి విట్టల్ రెడ్డి ఉమ్మడి జిల్లాల పోచారం భాస్కర్ రెడ్డికి ‌ సన్మానించారు. కార్యక్రమంలో నియోజకవర్గం ఇంచార్జ్ పోచారం సురేందర్ రెడ్డి, అయ్యప్ప ఆలయ వ్యవస్థాపకులు శంకర్ గురుస్వామి, ఆరోగ్య మహా పాదయాత్ర గురువినై కుమార్ గురు స్వామి, ఆర్డీవో రాజా గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, గురు స్వాముల బృందం పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement