Thursday, April 25, 2024

బ్యాడ్మింట‌న్ ఆడిన డిప్యూటీ మేయ‌ర్

కార్పొరేటర్లకు నిర్వహించిన మూడు రోజుల స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి హైద‌రాబాద్ లోని చందానగర్ పీజేఆర్ ఇండోర్ స్టేడియంలో సహచర కార్పొరేటర్లతో కలిసి షటిల్ బ్యాడ్మింటన్ ఆడారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో కార్పొరేటర్లు అందరూ ఉత్సాహంగా ఇండోర్ గేమ్స్ నందు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. స్పోర్ట్స్ ద్వారా రోజువారి దైనందిన కార్యక్రమాలను ఆరోగ్యవంతంగా, ఉత్తేజ భరితంగా పనిచేయగలమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, బన్నల గీత ముదిరాజ్, దేదీప్య రావు, మంజుల రెడ్డి, శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ శంకరయ్య, ఏఎంఓహెచ్ కార్తిక్, స్పోర్ట్స్ ఇన్ స్పెక్ట‌ర్ వీరనంద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement