Saturday, May 4, 2024

Delhi | అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కేసు విచారణ వాయిదా.. కౌంటర్ దాఖలుకు సమయం కోరిన సీబీఐ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసులో కౌంటర్ దాఖలుకు సీబీఐ సమయం కోరింది. సునీతారెడ్డి పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు సెప్టెంబర్ రెండో వారానికి విచారణ వాయిదా వేసింది. కౌంటర్  దాఖలు చేయడంతో పాటు తాజా ఛార్జిషీట్, కేసు ఒరిజినల్ ఫైల్‌ను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. వివేక హత్య కేసు చాలా సీరియస్ అంశం అంటూ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. గంగిరెడ్డి బెయిల్ పిటిషన్‌ను వేరుగా వినాలని ఆయన తరఫు న్యాయవాది కోరగా… గంగిరెడ్డి, అవినాష్ బెయిల్ అంశాలను కలిపే వింటామని స్పష్టం చేసింది. 

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement