Monday, May 20, 2024

TS | మల్టీ జోన్ వన్ ఐజీగా ఏవీ రంగనాథ్

వరంగల్ (ప్రభ న్యూస్) : తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా వరంగల్ మల్టీ జోన్ వన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా ఏవీ రంగనాథ్‌ను నియమించారు. డీఐజీ నుంచి ఐజీపీగా పదోన్నతి పొందిన తర్వాత ఉత్తర తెలంగాణ వ్యవహారాలను చూసే మల్టీ జోన్ వన్ ఐజీపీగా సర్కార్ ఆయనను నియమించింది.

గతంలో వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఏవీ రంగనాథ్ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించారు. ఓరుగల్లు ప్రజల మనస్సులను గెల్చుకొన్న ఏవీ రంగనాథ్ ను ఎన్నికల సంఘం సూచనల మేరకు శాసనసభ ఎన్నికల తరుణంలో కాంపెర్డ్ ఐపీఎస్ పేరుతో బదిలీ చేశారు. ప్రస్తుతం సుధీర్ బాబు మల్టీ జోన్ వన్ ఇన్ చార్జి ఐజీపీగా కొనసాగుతున్నారు. ఇప్పుడు తాజాగా, మల్టీ జోన్ వన్‌కు పూర్తిస్థాయి ఐజీపీగా ఏవీ రంగనాథ్‌ను ప్రభుత్వం నియమించింది. అలాగే ఐజీపీగా వరంగల్ రేంజ్ వ్యవహారాలను చక్కదిద్దబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement