Thursday, May 2, 2024

ఆటోవాలా అవ‌తారం ఎత్తిన మంత్రి – మ‌హిళా ఆటో డ్రైవ‌ర్ల‌కు స్ఫూర్తిగా ఆటో న‌డిపిన రోజా

ర‌వాణా రంగంలో స్వ‌యం ఉపాధిని ప్రోత్స‌హించేందుకు ఉద్దేశించిన వైఎస్సార్ వాహ‌న మిత్ర ప‌థ‌కాన్ని ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెండోసారి ప్రారంభించారు. కాగా తిరుప‌తిలో ఈ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మ‌యింది. వాహన మిత్ర పథకం కింద లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు మంత్రి రోజా..అనంత‌రం రోజా ఆటోవాలా అవతారం ఎత్తారు. కాకీ షర్ట్ ధరించి అధికారులను కూర్చోబెట్టుకొని ఆటో నడిపారు. మహిళా ఆటో డ్రైవర్లకు మంత్రి రోజా స్ఫూర్తినిచ్చారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ప్ర‌భుత్వ‌మ‌ని ఆమె కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement