Wednesday, May 15, 2024

Exclusive | వరదలో కొట్టుకుపోయిన ఆటో.. ప్రయాణికులు సేఫ్​!

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ప్రయాణికులు బిక్కుబిక్కుమంటున్నారు. అటు గోదావరి, ఇటు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎటువంటి ప్రయాణాలు చేయొద్దని సూచించారు. అయితే.. అత్యవసర పరిస్థితిలో ఆటోలో వెళ్లిన ప్రయాణికులు నిన్న (బుధవారం) రాత్రి వరదల్లో చిక్కుకున్నారు.

లక్ష్మీదేవి పల్లి మండలం సీతారాంపురం పంచాయతీ హార్జా తండా చప్టాపైనుంచి పారుతున్న వరద నీటిలో ఆటో కొట్టుకుపోయింది. ఈ ఆటో నీటి మధ్యలోకి వెళ్లిన తర్వాత సైలెన్సర్ లో కి నీరు పోయి ఆగిపోయినట్టు తెలుస్తోంది. దీంతో ఆటో దిగి ప్రాణాభయంతో ప్రయాణికులు ఇద్దరు ఒడ్డుకు చేరారు. కాగా, ఆటోతో పాటు డ్రైవర్ చింటూ నీటిలో కొట్టుకుపోయాడు. కాగా, ఓ చెట్టును పట్టుకుని చింటూ ప్రాణాలు కాపాడుకున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement