Sunday, April 28, 2024

ఆటో, ఆయిల్ ట్యాంకర్ ఢీ… ఒకరు మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు

ఆత్మకూరు : శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు మండల పరిధిలోని అమలాపురం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ఆయిల్ ట్యాంకర్ ఢీ కొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదు మందికి తీవ్ర గాయాలయాయి. ప్రమాదంలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కర్నూలు పట్టణానికి చెందిన మేదరి నాగన్నగా పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement