Tuesday, April 30, 2024

జమ్మూలో ఉగ్రవాదుల ఘాతుకం.. ఇద్దరు జవాన్లు మృతి

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. రాజౌరిలో ఉగ్రవాదులు జరిపిన పేలుడు ఘటనలో ఇద్దరు జవాన్లు మృతిచెందగా, మరో నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి. ఉగ్రవాదుల కదలికలున్నాయని జవాన్లకు సమాచారం రావడంతో.. అక్కడి చేరుకోగా.. రెండు వైపులా ఎన్ కౌంటర్ మొదలైంది. అయితే ఉగ్రవాదులు అక్కడి నుంచి తప్పించుకోవడానికి పేలుడు పదార్థాన్ని ఉపయోగించారు. దీంతో ఆ ఘటనలో ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతిచెందగా, ఒక ఉన్నతస్థాయి ఆర్మీ అధికారితో సహా నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనతో రాజౌరీ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement