Thursday, May 2, 2024

రంగారెడ్డి జిల్లాలో దారుణం.. మ‌ద్యం తాగించి వివాహిత‌పై గ్యాంగ్ రేప్…

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తున్న వివాహిత‌ను కిట్నాప్ చేసి మ‌ద్యం తాగించి గ్యాంప్ రేపుకు పాల్ప‌డ్డారు దుండ‌గులు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. పీరం చెరువు గ్రామం వద్ద ఇద్దరు దుండగులు వివాహితను కారులో కిడ్నాప్ చేశారు. కారులో కిస్మత్ పూర్ లో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లిన దుండగులు.. బలవంతంగా ఆమెకు మద్యం తాగించారు. మత్తులో ఉండగా ఒకరి తరువాత ఒకరు గ్యాంగ్ రేప్ చేశారు. మహిళను చాలా సేపు కారులో తిప్పారు. రాత్రి సమయంలో మహిళను గండిపేట వద్ద దుండ‌గులు వ‌దిలి ప‌రార‌య్యారు. మ‌ద్యం మ‌త్తు నుంచి తురుకున్న వివాహిత వెంట‌నే భ‌ర్త‌కు ఫోన్ చేసి జ‌రిగిన విష‌యాన్ని తెలిపింది. దీంతో భర్త నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement